ఆరో జ్యోతిర్లింగం 'భీమశంకరం' మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది. భీమానది సమీపంలో ఉండడం వల్ల భీమశంకరుడు అయినాడు. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని 'డాకిని' అంటారు. ఆమె ఇక్కడ పరమేశ్వరునికై తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని డాకిని, శాకిని మొదలైన భూతప్రేత పిశాచాలు ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయట. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూతప్రేత పిశాచాల భయం పోతుందట.
Monday, 20 August 2018
Thursday, 16 August 2018
Tuesday, 14 August 2018
మన జెండా పండుగ
జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం. ఇది ఎందరో వీరుల పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలం. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి మన దేశానికి విముక్తి లభించిన రోజు.... 'ఆగస్టు 15' మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. ఈ సందర్భంగా మనకు స్వేఛ్ఛావాయువులు అందించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
Monday, 13 August 2018
అయిదో జ్యోతిర్లింగం
కేదారేశ్వరలింగం భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వర లింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. ఉత్తరదిక్కున ఎత్తయిన మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కేదారేశ్వర జ్యోర్లింగం. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు. దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వారు సేవిస్తూ ఉంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి వరకు ఆరు నెలలు మాత్రమే ఈ దేవాలయం తెరచియుండి భక్తులకు దర్శనం కలుగుతుంది. దీపావళి రోజున స్వామికి నేతితో దివ్యజ్యోతి వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమినాడు తెరిచేనాటికి ఆరు నెలల క్రితం వెలిగించిన దీపం యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది.
Sunday, 5 August 2018
నాలుగో జ్యోతిర్లింగం
ఓంకారేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ క్షేత్రం వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరి నదుల మధ్య ఉంది. సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడిందట. ఆ శివలింగంలోంచి ఓంకారం వినబడుతుంది గ్రహించాడు. ఆయన పెద్దలను తీసుకొచ్చి చూపించాడట. పెద్దలు చూసి 'ఓంకారేశ్వరుడని' పేరు పెట్టారని చెబుతారు. అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం. అది నిత్యనూతనం. ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల ప్రణవనాద అనుసంధానంతో ఏకాగ్రత లభిస్తుందంటారు.
Sunday, 29 July 2018
మూడో జ్యోర్లింగం
ఉజ్జయిని మహాకాళేశ్వరలింగంగా ప్రసిద్ధమైనది మూడో జ్యోర్లింగం. ఈనాటి ఉజ్జయిని ప్రాచీన నామం అవంతి. మహాభక్తుడైన మార్కOడేయుణ్ణి రక్షించడానికి కాలుడైన యముణ్ణి సంహరించిన శివుడు ఇక్కడ మహాకాళుడు అయినాడట. కాశి దాసాది మహాకవులు, ఆదిశంకరుల వంటి ఆచార్యులు స్వామి అనుగ్రహాన్ని పొందిన ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ క్షేత్రంలో స్వామి ముక్తిప్రదుడు. అకాలమృత్యువు నుండి రక్షిస్తాడట.
Subscribe to:
Posts (Atom)