”శోధిని”

Sunday 26 July 2015

మాట్లాడటం పద్దతిగా ఉండాలి !

సృష్టిలో ఏ ఇతర జీవికి  ఇవ్వని   మాట్లాడే  అవకాశం భగవంతుడు మానవుడుకి కల్పించాడు.  దేవుడు నోరు ఇచ్చాడు కదా అని  ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది.   అతిగా మాట్లాడేవారిని లోకం పట్టించుకోదు. అవసరమైనంత వరకే మాట్లాడితే ఆ మాటకు, ఆవ్యక్తికి విలువ ఉంటుంది.  అందుకే మనం మాట్లాడే ప్రతి  మాటను బాగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి మనిషి మాహాత్ముడుగా కానక్కరలేదు.  సాటి మనిషితో ప్రేమతో మాట్లాడితే చాలు.  అసహనం, కోపం అనాలోచిత చర్యల మూలంగా ఎన్నో అనర్థాలు జరిగి, మంచి మిత్రులను దూరం చేసుకోవాల్సి వస్తుంది.  కోపంతో మనం మాట్లాడే మాటలు దగ్గర వారిని ఎంతగానో బాధిస్తాయని, వారి ప్రేమను కోల్పోతామని  గ్రహించాలి.  అలా కాకుండా మనం మాట్లాడే పద్దతే మంచిదనుకుంటే, మాటల్లో కాలేసినట్లే!   ప్రతి మనిషికీ ఆత్మ నిగ్రహం అవసరం.  అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది.