”శోధిని”

Wednesday 25 September 2013

మన ప్రజా ప్రతినిధులు!

కొందరు అధికారం కోసం 
ప్రజలను పావులు చేస్తే,
మరికొందరు పదవుల కోసం 
నమ్ముకున్న ప్రజలను 
నయవంచన చేస్తున్నారు 
అధికారం పొందాలంటే 
తెలుగు జాతిని ముక్కలు చేయాలా? 
తమ పదవుల కోసం 
ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా?
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేసినా 
ప్రజలకు వోరిగేది ఏమీలేదు
లాభం మాత్రం రాజకీయ నాయకులకే!
ఇలాంటి నాయకులకు
ఓటు అడిగే హక్కు లేదు
ప్రజల మధ్య తిరిగే అర్హత
అంతకన్నా లేదు.