”శోధిని”

Tuesday 24 April 2012

'మల్లీశ్వరి'



ప్రకృతి సోయగాల్ని, హృదయపు లాలిత్యాన్ని మేళవించిన పాటలు పరిమళిస్తాయ.  మనసున నిలిచి మధురానుభూతిగా మిగులుతాయి. 'మల్లీశ్వరి'  చిత్రంలోని ఈపాట  కోవలోకే వస్తుంది

మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల  డోలలూగెనె
ఎంత హాయి రేయి నిండెనో 
ఎన్నినాళ్ళకి బ్రతుకు పండెనో 

కొమ్మలు గువ్వలు గుసగుస మనినా 
రెమ్మల గాలులు ఉసురుసురనినా 

అలలు కొలనులో గలగలమనినా 
దవ్వుల రేణువు సవ్వడు వినినా 

నువ్వు వచ్చేవని -నీ పిలుపే విని 
కన్నుల  నీరిడి కలయ చూసితిని

గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా 

ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో 
ఎంత హాయి రేయినిండెనో 

చిత్రం:    మల్లీశ్వరి 
రచన:    దేవులపల్లి కృష్టశాస్త్రి 
గానం:    భానుమతి 
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు