”శోధిని”

Monday 22 April 2013

నీటి కష్టాలు!














రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో త్రాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.  లక్షలాది మంది గుక్కెడు మంచి నీళ్ళ కోసం అల్లాడుతున్నారు.  దానికి తోడూ విద్యుత్ కోతలు ఈ సమస్యను మరింత తీవ్రం  చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  ఈ జిల్లాలలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయాయి.  ఈ పరిస్థితి కావడానికి కారకులు మన పాలకులే.  ఓట్ల కోసం అన్నీ ఉచితాలు ఇస్తామని వాగ్ధానాలు చేసే రాజకీయ నేతలే.  ప్రజలు త్రాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలేని పాలకులు ఎన్నికలు రాగానే అన్నీ ఉచితం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. నీటి కోసం ప్రజలు పడే పాట్లు చూసి కుడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  నీటిని నింపాల్సిన చెరువులు కజ్జాకు  గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. ఇష్ట మొచ్చినట్లు  బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తుంటే పట్టించుకునే నాధుడే లేడు.   ఫలితంగా నేడు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.  ఎప్పటి కైన పాలకులు, రాజకీయ నాయకులు మేల్కొని తక్షణమే నీటి సమస్య పైన దృష్టి పెట్టాలి.