”శోధిని”

Friday 24 July 2015

పుష్కర స్నానం !



పుష్కర స్నానాలు ఆచరించేవారు గంగా దేవిని స్మరించుకుంటూ జలాన్ని కలుషితం చేయకుండా ముక్కు మూసుకుని మూడు మునకలు వేసి,  నదికి నమస్కరించి బయటకి రావాలి.  అప్పుడే పుణ్యం లభిస్తుంది.  అంతేకాదండోయ్ ... మన మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి.   మోసాలు, నేరాలు చేసి నదిలో మునకేస్తే చేసిన పాపాలు తొలగిపోవు.  సమాజంలో ఎవ్వరికి ఏ హాని తలపెట్టకుండా మనసును పవిత్రంగా ఉంచుకుని పుష్కర స్నానం  చేస్తే ఫలితం దక్కుతుంది.  శరీరాన్ని శుభ్రం చేసుకుని, మనసులోని మలినాన్ని కడిగేసుకోకపోతేఎన్ని పుష్కర స్నానాలు చేసినా నిష్పలం అవుతుంది.  నదిలో జలకాలాట ఆడి, జలాలను కలుషితం చేయడాన్ని పుష్కర స్నానం అనరు.  మనసును నిర్మలంగా ఉంచుకొని, మమతానురాగాలకు గాని, ఈర్ష్య అసూయలను గాని తావు ఇవ్వకుండా పుష్కర స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.