ఆరో జ్యోతిర్లింగం 'భీమశంకరం' మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది. భీమానది సమీపంలో ఉండడం వల్ల భీమశంకరుడు అయినాడు. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని 'డాకిని' అంటారు. ఆమె ఇక్కడ పరమేశ్వరునికై తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని డాకిని, శాకిని మొదలైన భూతప్రేత పిశాచాలు ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయట. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూతప్రేత పిశాచాల భయం పోతుందట.