”శోధిని”

Monday 27 August 2018

ఏడో జ్యోతిర్లింగం


వరుణ, అసి అనే రెండు నదుల సంగమం అయిన  వారణాసిలో కొలువై ఉన్నాడు సుప్రసిద్ధుడైన కాశీవిశ్వేశ్వరుడు. ఇక్కడ అమ్మవారు విశాలాక్షిగా, అన్నపూర్ణగా భక్తులను కాపాడుతోంది.  కాశి  దర్శనం వల్ల పాపాలన్నీ పోతాయంటారు.  ఆ అనాథ నాథుడు విశ్వనాథుడు.  ప్రళయకాలంలో ప్రపంచం మొత్తం నీటిలో మునిగినా కాశిక్షేత్రం మాత్రం అలాగే ఉంటుందని స్కాందపురాణం చెబుతోంది.  ఇక్కడ మరణించినవారికి ముక్తి లభిస్తుందంటారు.