”శోధిని”

Wednesday 25 March 2015

పవిత్ర గ్రంధాలు !



ప్రతి ఇంటా రామాయణం, మహాభాగవతం, భగవద్గీత  ఈ మూడు పవిత్ర గ్రంధాలు తప్పనిసరిగా ఉండాలి.  ఈ మూడు గ్రంధాలను అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే జీవితానికి ఒక మార్గం కనిపిస్తుంది.    రామాయణం చదవడం వల్ల ఒక మనిషి ఎలా జీవించాలో, మంచి వ్యక్తిగా ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.    మహాభాగవతం చదవడం వల్ల భగవంతుడు ఎంతటి కరుణామయుడో,  తన భక్తుల్ని ఆదుకునేందుకు ఎల్లవేళలా ఎలా వెన్నంటి ఉంటాడో అర్థమవుతుంది.  గర్వం, అహాన్ని అణచివేసుకోవాలంటే భగవద్గీతను పారాయణ చేయాలి.  అందుకే ముచ్చటగా ఈ మూడు గ్రంధాలను ఇంట్లో పెట్టుకుని, నిత్యం చదువుతూ ఉండటం ఎంతో అవసరం.