మనవ సమాజంలో మహిళల పాత్ర మహోన్నతమైనది. మాతృత్వం, ప్రేమ, సహనం, త్యాగం ఆమె సొత్తు. తల్లిగా, భార్యగా, కూతురిగా, సోదరిగా మమతానురాగాలకు మహిళ పెట్టింది పేరు. అయితే, పురుషాధిక్య సమాజంలో అత్యాచారాలు, ఆత్మహత్యలు స్త్రీకి శాపాలుగా మారాయి. ఎన్ని చట్టాలు చేసినా,ఎన్ని శిక్షలు వేసినా ఈ ఆగడాల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. జన్మనిచ్చిన తల్లి లాంటి స్త్రీని హింసించడం అమానుషం. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి మహిళ ఓ ఝాన్సీ లక్ష్మిభాయిలా ఉద్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలను కన్నతల్లిలాగా గౌరవించినప్పుడే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది.