”శోధిని”

Friday 21 December 2018

స్వామివారి నిత్యకళ్యాణం


తిరుమల కొండ పరమ పావనమైనది.  బ్రహ్మమయమైనది.  సచ్చిదానంద స్వరూపమైనది.  పరమాత్ముడైన వెంకటాచలపతి దివ్యపాదస్పర్శతో పునీతమైనది.  తిరుపతి  కొండ యొక్క ఆణువణువూ భగవత్స్వరూపం.  కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రాన్ని ప్రతి భక్తుడూ  దర్శించి శ్రీ వేంకటేశ్వరుడు కృపకు పాత్రులవ్వాలి.  పద్మావతీ దేవి పేరుతొ మొదలైన స్వామివారి కళ్యాణం.  ప్రతి నిత్యం  శ్రీదేవి భూదేవిలతో జరుగుతూ  ఉండటం విశేషం.