”శోధిని”

Wednesday 8 January 2014

"వీళ్ళా ... మన ప్రజాపతినిధులు?"


రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నా తీరు అసంతృప్తి కలిగిస్తోంది.  ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు పరస్పర వ్యక్తిగత నిందారోపణలు చేసుకోవడంతోనే అసెంబ్లీ సమావేశాల సమయం హరించుకు పోతోంది. తెలంగాణా బిల్లుపై చర్చించి, పార్టీల వారిగా వారివారి అభిప్రాయాలు తెలియజేయాల్సిన నేతలు అసెంబ్లీ ని వ్యక్తిగత దూషణలకు వేదికగా ఉపయోగించుకోవడంవల్ల ఏంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది. ఎవడబ్బ సొమ్మని ప్రజల సొమ్మును నీళ్ళలా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.  ప్రజాస్వామ్యవాదులకు ఉండవలసిన సహనం, సంయమనం అటు అధికారపక్ష నాయకులకు, ఇటుప్రతిపక్ష నాయకులకు  లోపించడం ప్రజల దురదృష్టం.  వీరికి మంత్రులు వత్తాసు పలకడం శోచనీయం.  ఇప్పటికైన ప్రజాప్రతినిధులు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి  వైఖరులను విడనాడండి.  వ్యక్తిగత దూషనలకు స్వస్తి పలికి, ఆగ్రహావేశాలను లోనుకాకుండా  సహనంతో వ్యవహరిస్తూ, చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పండి.  శాసనసభ గౌరవాన్ని కాపాడండి.