”శోధిని”

Friday 5 June 2015

పర్యావరణ పరిరక్షణ ...ప్రగతికి సోపానం !


పర్యావరణాన్ని పరిరక్షించాలంటే...  మనసున్న ప్రతి ఒక్కరూ ప్రకృతితో యుద్ధం చేయడం ఆపి సహజీవనం చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా మందుకు రావాలి.    కొండలను పిండి చేయడం మానుకోవాలి.  నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  అడవులను  నాశనం చేయడం ఆపాలి.  జంతువులను స్వేచ్చగా తిరగనివ్వాలి.  మొక్కలను నాటి పరిసరాలంతటా పచ్చదనాన్ని  నింపాలి.  నింగి నుండి రాలే ప్రతి నీటి బొట్టును పుడమిలో భద్రంగా దాచాలి.  పర్యావరణానికి ముప్పు వాటిల్లినప్పుడు అకాలవర్షలు అతలాకుతలం చేస్తాయి.  మండే ఎండలు మనుషుల్ని మాడ్చేస్తాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి.  ఋతుపవనాలు గతి తప్పి భూగోళం వేడెక్కుతుంది.  ఇప్పుడయినా  మనిషి మేల్కొనక పొతే రాబోయే  రోజుల్లో మనిషి మనుగడ అసాధ్యం.  రాబోవు తరాల వారిని దృష్టిలో పెట్టుకొని  వారి క్షేమం కోసం హరిత ప్రకృతిని కాపాడుదాం.