”శోధిని”

Friday 11 July 2014

ఆచార్య దేవోభవ !

       

     
     అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు ... పరబ్రహ్మ స్వరూపులు.  తమ శిష్యులలో జ్ఞానజ్యోతిని వెలిగించి... అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సన్మార్గంలో పయనించడానికి ప్రేరణ కలిగిస్తారు. దాంతో గురువుల సన్నిధిలో శిష్యులు జ్ఞానవంతులవుతారు.  అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమును ఇచ్చేవారు గురువులు కాబట్టి వారిని  దైవంగా భావించాలి.  అయితే గురువులకు నేర్పు, పట్టుదల కలిగిన శిష్యులు ఉన్నప్పుడే సమాజం అన్ని రంగాలలో వృద్ధి చెంది ముందుకు వెళుతుంది.  అటువంటి గురువుల ఆశ్రయం శిష్యులందరికీ మార్గదర్శకం అవుతుంది.  అయితే గురువులపైన శిష్యులకు అచంచల విశ్వాసం ఉండాలి.  అలాగే శిష్యులపైన గురువులకు అమితమైన అభిమానం ఉండాలి.  ధనం కన్నా జ్ఞానం గొప్పదని ఇరువురు గుర్తించాలి.   

     గురు పౌర్ణమి సందర్భంగా  దైవస్వరూపులయిన గురువులందరికీ ప్రణామములు.