”శోధిని”

Saturday 5 May 2018

శేషాద్రి




సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠoలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తేలకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పాడు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయుదేవుడు ఏమిచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో ఆదిశేషుడు తన పడగ ఎత్తి చూశాడు. దాంతో పట్టు సడలి వాయుదేవుడు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.