”శోధిని”

Saturday 27 September 2014

జయలలితకు జైలు శిక్ష !



అక్రమాస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. మొత్తం దోషులు నలుగురికి కలిపి రూ. 100 కోట్లు భారీ జరిమాన విధించింది. ఈ మొత్తాన్ని దోషులు ఒక్కొక్కరు రూ.25 కోట్లు చొప్పున చెల్లించాలి. దీనితో ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు.