కొందరు ఆధునిక అవసరాల పేరుతో కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు. మరికొందరు ధన సంపాదనకోసం నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ అత్యంత దయనీయంగా, క్రూరంగా పెనువిద్వంసం సృష్టిస్తున్నారు. ఇంకొందరు నిర్ధాక్షణంగా చెట్లను నరికేస్తూ, వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు. ఇలా సహజవనరులను హరించేస్తూ, జంతువులను, పక్షులను నాశనం చేస్తూ ప్రకృతి వినాశనానికి ఇదొక విధంగా కారణమవుతున్నారు. ఫలితంగా తుఫానులు, భూకంపాలు! మన కళ్ళను మనేమే పొడుచుకుంటూ... మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం. ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి. పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం... భూమిని భూమిలా ఉండనిద్దాం... చెట్లను చెట్లగా బ్రతకనిద్దాం... నదులను నదులుగానే పారనిద్దాం ... మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !