
రాష్ట్రంలోఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలయింది. తాయిలాలు ఓటర్లకు అందించడానికి సిద్దమయ్యారు. ఆడవారికి చీరలు, ముక్కుపుడకలు, మగవారికి మద్యం, డబ్బు, గల్లీ నాయకుడికయితే స్కూటర్, సెల్ ఫోన్, ఇంటికో బస్తా బియ్యం ఇలా కోట్లాది రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేసున్నారు. ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి. ఓటును అమ్ముకోవడం మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఓటు మన జన్మ హక్కు. దాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం. ఎంతో విలువైన ఓటును మద్యానికి, డబ్బుకు ఆశపడి అమ్ముకోవడం అంత నీచమైన పని మరొకటిది ఉండదు.