”శోధిని”

Monday 11 June 2012

ఓటర్లకు తాయిలాలు


          నిన్న మా ఆఫీసులో పనిచేసే ఒకతను  భార్యాపిల్లలతో బస్టాండ్ లో  కలిసాడు.  'ఓటు వేయడానికి మా ఊరికి వెళ్తున్నాను' అన్నాడు.  'ఓటు వేయడానికి ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాడు' అంటే ప్రజాస్వామ్యం మీద వాడికున్న నమ్మకాన్ని చూసి అతన్ని  అభినందించాను.  'ప్రజాస్వామ్యానికి ఓటే పునాది' అని అతనితో  అంటే,  ప్రజాస్వామ్యమా...? నా బొందా...! ఒకపార్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు, ఇంకొక పార్టీ వాళ్ళు ఐదు వందలు, మరో పార్టీ వాళ్ళు బంగారు ముక్కుపుడక.. వీటితో పాటు మద్యం, బిర్యాని ప్యాకెట్లు ఇస్తున్నారని మా గ్రామం వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్తున్నాను అన్నాడు.

        రాష్ట్రంలోఉపఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇక ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలయింది. తాయిలాలు ఓటర్లకు  అందించడానికి సిద్దమయ్యారు. ఆడవారికి చీరలు, ముక్కుపుడకలు, మగవారికి మద్యం, డబ్బు, గల్లీ నాయకుడికయితే స్కూటర్, సెల్ ఫోన్, ఇంటికో బస్తా బియ్యం ఇలా కోట్లాది రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేసున్నారు.  ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి.  ఓటును అమ్ముకోవడం మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.  ఓటు మన జన్మ హక్కు.  దాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం.  ఎంతో విలువైన ఓటును మద్యానికి, డబ్బుకు ఆశపడి అమ్ముకోవడం అంత నీచమైన పని మరొకటిది ఉండదు.

       

10 comments:

భాస్కర్ కె said...

enikalalo,
dabbu kattalu,
angadi sarukaindi,
adhikaram.
o chinna nanni.

జలతారు వెన్నెల said...

నాని రూపేనా కామెంట్ పెట్టేసారు భాస్కర్ గారు.
కష్టమండి ఫ్రీ గా ఇచ్చే వాటిమీద ఆశపడకుండా ఉండటం.
మీరెప్పుడన్నా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంటే,జనం ఎలా ఎగబడతారో చూసారా?
ఈ ఓట్లు అమ్మకాలు, కొనుగోలు ఆగాలంటే, law strict gaa action తీసుకోవాల్సిందే!
అలా law strict గా అయ్యేదెప్పుడంటారు?

కాయల నాగేంద్ర said...

మన పాలకులు నీతిమంతులు అయినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది.

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు!

Anonymous said...

/ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి/
ఎంతమాటన్నారండి? మనం తీసుకోకుంటే ఇచ్చేవాడికి ఇచ్చేదురదెలా తీరేది?! మనం తీసుకోనంత మాత్రాన వాడు ఇవ్వడా, తీసుకునేవాళ్ళుండరా?
అందరి దగ్గరా అందినంత తీసుకోవాలి, ఓటు కూడా ఇచ్చినోళ్ళందరి గుర్తులపైనా సమన్యాయం పాటించి గుద్దాలి, అదే న్యాయం. :))

శ్యామలీయం said...

> ఇచ్చినోళ్ళందరి గుర్తులపైనా సమన్యాయం పాటించి గుద్దాలి. అదే న్యాయం

అవునండోయ్. ఒక సారి, "డబ్బిచ్చినోళ్ళందరికీ వోటేసా" అన్న ముసలాయననూ చూసాను మరి.

Meraj Fathima said...

నాగేంద్ర గారూ, అమాయక జనాలు ఇచ్చిన కొంచమే ఆశిస్తున్నారు కాని పోగుట్టుకుంటున్న భవితను ఆలోచించటం లేదు.

కాయల నాగేంద్ర said...

మీ న్యాయం చాలా బాగుందండీ!

కాయల నాగేంద్ర said...

అవునండీ! ఇప్పటికీ చాలా చోట్ల ఇలాగే జరుగుతోంది.

కాయల నాగేంద్ర said...

అమాయక ప్రజలు చైతన్యవంతులయితే ఈ వ్యవస్థ కొంతయినా మారుతుంది.