”శోధిని”

Tuesday 22 May 2018

ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం (22-05-2018)


సుఖాలకు అలవాటు పడిన మానవుడు చెట్లను నరుకుతున్నాడు.  భూమాత గుండెల్లో గునపాలు నింపుతున్నారు. దయాదాక్షిణ్యం లేకుండా జంతువులను చంపుతున్నాడు.  రానురానూ మానవుడిలో ప్రక్రుతి పట్ల నియమం, నిబద్దత తగ్గిపోతూ రాక్షసుడుగా మారిపోతున్నాడు.  తన స్వార్థంతో తన సుఖాన్నే వెతుక్కుంటున్నాడే తప్ప ప్రకృతి గురించి ఆలోచించడం లేదు.   ఫలితంగా   జీవవైవిధ్యం దెబ్బతింటున్నది.  కొండలు, కోనలు, లోయలు, సరస్సులు, చెరువులు ఇలా ప్రకృతి సంపదంతా మనిషి స్వార్థానికి బలి అవుతున్నాయి.  ప్రకృతి వనరులను మానవుడి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటే తప్పులేదు.  అత్యాశకు పోవడం వల్లనే ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.  దాంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అమూల్యమైన జీవరాశి అంతరించిపోతోంది.  ఇప్పటికైనా మానవుడు రాక్షసత్వాన్ని వీడి జీవరాశులన్నింటితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి.  జీవరాశులను పరిరక్షించుకుంటే జీవవైవిధ్యం  పెరుగుతుందని తెలుసుకోవాలి.