”శోధిని”

Saturday 30 May 2015

మానవసేవే మాధవసేవ !


శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన గొప్ప సేవ అన్నదానం కార్యక్రమం.  నిత్యం ముప్పయివేల మందికి పైగా భక్తులు అన్నదానం కాంప్లెక్స్ లో భోజనం చేసి స్వామివారి మహాప్రసాదం తిన్నంత ఆనందపడిపోతారు. పేద భక్తులకు ఈ సదుపాయం నిజంగా ఒక వరమే !  రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉచిత భోజనాలు పెడుతూనే ఉంటారు.  ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయన చేతుల మీదుగా ప్రారంభమైన గొప్ప పుణ్య సేవా కార్యక్రమం అన్నదానం.