”శోధిని”

Monday 20 February 2017

అర్థనారీశ్వరుడు



అనుగ్రహప్రదాత, మంగళ స్వరూపుడయినా  పరమేశ్వరుడులో పురుషుడి శక్తి సగం,  అయన సతీమణి పార్వతి శక్తి సగం సమ్మేళతంగా ఉంటుంది.  సమస్త చరాచర ప్రపంచం శక్తిరూపంతోనే ఏర్పడింది కాబట్టి,  శక్తి రూపం లేకుండా శివుడు ఏమీ చేయలేడు.  అందుకే స్త్రీ, పురుషుడు కలిసి ఒకే రూపంగా ఏర్పడితేనే ఎదైనా సాధ్యమవుతుంది.  ఈ విషయాన్ని మనకు తెలియచేయడానికి ఈశ్వరుడు అర్థనారీశ్వర రూపాన్ని ధరించాడు.  ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని స్త్రీ, పురుషులిద్దరూ  సమానమేనని తెలియజెప్పాడు.