”శోధిని”

Tuesday 27 December 2016

విజయవంతంకాని (మైన) 50వ రోజు

నల్లధనాన్ని, నకిలీని కట్టడిచేయాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యే అయినా, ఆదెబ్బకు దేశం మొత్తం  డబ్బు సమస్యతో అతలాకుతలమైపోయింది.  నల్లధనస్వాములు మాత్రం హాయిగా ఉన్నారు.  కోట్ల రూపాయల  కొత్తనోట్లు  బడాబాబుల ఇంట్లోకి చేరిపోయాయి.  ఎటొచ్చి సామాన్యులే  బ్యాంకులు,  ఏటీఎంల దగ్గర చేంతాడంత పొడవైన క్యూలో  అష్టకష్టాలు పడుతున్నారు.  బ్యాంకుల్లో డబ్బుఉండికూడా డబ్బును తీసుకోలేని పరిస్థితి. ఇంటశుభకార్యాలు తలపెట్టుకున్నవాళ్ళు నోట్లవేతలతో తల పట్టుకుంటున్నారు.  ఇది ప్రజల సహనానికి ప్రభుత్వం పెట్టిన పెద్ద పరీక్ష.  గత 50 రోజులుగా దేశంలోని ప్రజలు నరకమంటే ఏమిటో చవిచూస్తున్నారు.  కొత్త సంవత్సరంలోనైనా నోట్లపాట్లు తీరుతాయో లేదో ఆ భగవంతుడుకే తెలియాలి.