శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని భక్తిశ్రద్దలతో నిండు మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసం మహిళలందరికీ మంగలప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది. వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి, నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన వారింట అమ్మవారు కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం.