”శోధిని”

Wednesday 25 May 2016

పచ్చని కాపురాలలో చిచ్చు !



స్మార్ట్ ఫోన్, వాట్సఫ్, పేస్ బుక్  లాంటి సాధనాలను  సరిగా వినియోగించకపోతే పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది.  వీటి ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు పండంటి కాపురాల్లో కలతలు రేపుతున్నారు.  దాంతో దంపతుల మధ్య అనుమానపు పొరలు పెరిగి, నిండు సంసారాలు పెటాకులు అవుతున్నాయి.  ముఖ్యంగా కొత్త కాపురాలలో ఇలా జరుగుతుండటం విచారకరం.  అందుకే పై సాధనాలు ఉపయోగించేటప్పుడు మిత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.