”శోధిని”

Thursday 2 October 2014

విజయదశమి శుభాకాంక్షలు !

విజయాలను అందించే పర్వదినం దసరా పండుగ.  ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మ ఆశీస్సులు లభిస్తాయంటారు.  దేవీనవరాత్రుల సందర్భంగా  ఆలయాలలో రోజుకో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు.  తమను వేధిస్తున్న మహిషాసురిడికి స్త్రీ వలన మృత్యువు వాటిల్లుతుందని గ్రహించిన దేవతులు విష్ణువును శరణు కోరతారు.  అప్పుడు విష్ణువు సకలదేవతాంశాలను తేజోశ్శక్తులుగా కలబోసుకొని ఒక స్త్రీ ఆవిర్భవించినట్లయితే, మహిశాసురుడిని ఆ స్త్రీమూర్తి చేత సంహరించ చేయవచ్చునని  చెబుతాడు.  ముందుగా బ్రహ్మ ముఖం నుండి తేజోరాసి  ఆవిర్భవించింది.  శివుడు నుండి వెండిలాగా ధగధగలాడుతున్న మరోకాంతి పుంజం మణి కాంతులతో వెదజల్లుతూ కనిపించింది.  విష్ణుమూర్తి నుండి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణం లాగావున్న ఇంకో తేజస్సు వెలువడింది. ఇలా సకలదేవతలనుండి అప్పటికప్పుడు తేజస్సులు వెలువడి ఒక దివ్య తేజోరాసి అయిన స్త్రీమూర్తిగా  రూపం దాల్చింది. తరువాత దేవతలందరూ  తమ ఆయుధాలను పోలివున్న ఆయుధాలను ఆమెకు బహుకరించడం జరిగింది.  ఇలా అనేక ఆయుధాలను ధరించిన ఆమె శక్తిస్వరూపినిగా అవతరించింది, సింహవాహనాన్ని అధిష్టించి, మహాశక్తిరూపంతో మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది.  ఈరోజు అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.  శత్రుభయాలు తొలగిపోయి సకలవిజయాలు కలుగుతాయి.

     మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు !

మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం !



జాతిపిత మహాత్మాగాంధీ  జయంతి సందర్భంగా దేశంలో
శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం!
మనచుట్టూ  వున్న పరిసరాలను 
పరిశుభ్రంగా ఉంచుకుందాం!
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో పయనిద్దాం!
దేశాన్ని అభివృద్దివైపు నడిపిద్దాం!!