”శోధిని”

Thursday 28 August 2014

ప్రణవనాద స్వరూపుడు !



బాద్రపదమాసం శుక్లపక్షంలో చవితి నాడు మధ్యాహ్నం వేళ  పార్వతీదేవికి పుత్రునిగా వినాయకుడు అవతరించాడు.  చవితి ఏ రోజు మధ్యాహ్నం వేళ  ఉంటుందో, ఆరోజు  వినాయకచవితి పండుగను చేసుకోవడం వలన సకల శుభాలు, సౌఖ్యాలు  చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ చవితి ఆదివారం కానీ, మంగళవారం గానీ వస్తే చాలా మంచిదంటారు.   మట్టితో చేసి రంగులువేయని వినాయక విగ్రహాన్ని పూజించడం వలన  కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయాభివృద్ది కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.  అందుకే వినాయకచవితి నాడు నీటిలో కరిగే మట్టి విగ్రహాన్ని పూజించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలి.  కొండంత దేవుడుకి కొండంత పత్రి సమర్పించాకపోయినా ఫలమో, పత్రమో ఏదో ఒకటి స్వామికి నివేదిస్తే చాలు గణనాధుడు తృప్తి చెందుతాడు. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతాముర్తిని నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది.  వినాయకచవితిని భారతదేశమంతా అత్యంత వైభవంగా జరుపుకోవడం మన సంస్కృతిని వెల్లడి చేస్తుంది.                                                                      

            మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!