”శోధిని”

Thursday 24 July 2014

పాపం ... పసివాళ్లు!




గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం?

ధూమపానం ... ప్రాణాంతకం !



బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా...  దీని పైన అధికారులు దృష్టి  సారించక పోవడంతో పొగబాబులు, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాక పక్క నున్న వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు.  నిబంధనలు కాగితాలకే పరిమితం చేయకుండా వాటిని అమలు చేస్తూ, బహిరంగ  ప్రదేశాలలో పొగత్రాగే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి.  ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించాలి.    సిగరేట్టులో నికోటిన్ అనే పదార్ధం ఉండటం వలన క్యాన్సర్, శ్వాశాకోస  వ్యాధులు, బి. పి, హార్ట్ ఎటాక్ వంటివి వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కుర్రకారు మాత్రం గుప్పు గుప్పు మంటూ పొగను ఉదేస్తూ వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.  బతుకంతా పొగవలయమైతే చివరికి మిగిలేది అస్థిపంజరమేనని పొగబాబులు గుర్తుంచుకోవాలి.