”శోధిని”

Sunday 5 April 2015

ప్రజా ప్రతి'నిధులు' !


మనం ఎన్నో ఆశలు పెంచుకుని ఎన్నుకున్న ప్రజా పతినిధులు చట్టసభలలోకి అడుగు పెట్టగానే ఏమవుతుందో ఏమో తెలియదు కాని ప్రతి ఒక్కరూ సభలో  వీరంగం సృష్టించడానికి  పోటీ పడుతున్నారు.  ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చుస్తున్నారనే విషయాన్ని మరచిపోయి, దేశంలో ఉన్న బూతు మాటలన్నీ మాట్లాడేస్తూ... దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు.   స్త్రీ, పురుష అనే భేదం లేకుండా వారు మాట్లాడుతున్న బూతు మాటలు, ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంటున్నాయి.  తోటి సభ్యులను బెదిరించడం, ఏకవచనంతో సంభోదించడం పరుష పదజాలంతో దూషించడం అలవాటయిపోయింది. చట్టసభలంటే  బలాబలాలు ప్రదర్శించుకోవడం, అసభ్య పదజాలంతో  వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వేదిక కాదని,  మన ప్రజా ప్రతినిధులు ఎప్పుడు తెలుసుకుంటారో మరి.  రాబోయే సమావేశాలలో నైనా  ప్రజాప్రతినిధులు  హుందాగా ఉంటూ, సామాన్య ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు...లేకుంటే తిరస్కరిస్తారు.