”శోధిని”

Tuesday 4 August 2015

అంతా... రాజకీయమే !


చట్టసభల సమావేశాలు జరుగుతున్న తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది.  ప్రతిపక్షాలు  సభలు జరగకుండా చేయడం,  అధికార పక్షం  దానికి ధీటుగా వ్యవహరించడంతో   చట్టసభల   సమావేశాల సమయం హరించుకుపోతోంది. ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించవలసిన చట్టసభలు   నేతల పరస్పర ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది.  ప్రజాస్వామ్య వాదులకు ఉండవలసిన సహనం, సంయమనం ఇటు అధికార పక్షంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ లోపించడం ప్రజల దురదృష్టకరం.   ప్రజాసమస్యలను చర్చించకుండా, కళింకిత మంత్రుల రాజీనామా కోసం   సభల ప్రతిస్థంభనకు గురికావడం బాధాకరం.  తప్పుచేసినవాళ్లు నిజాయితిగా తప్పుకుంటే విలువ వుంటుంది.  మేము తప్పుచేయలేదు దేవుడో చర్చలకు మేం సిద్దం అని మంత్రులు  అంటుంటే, సభలో చర్చించకుండా రాజీనామా కోసం పట్టుపట్టి సభలను జరనీయకుండా చేయడం....  ఈ రాజకీయాలేమిటో... ప్రజలకు అర్థం కావడం లేదు.