”శోధిని”

Sunday 9 June 2019

మెరిసే పట్టులాంటి కురులు కోసం ....


యాబై గ్రాముల మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గుప్పెడు మందారాకులను, గుప్పెడు గోరింటాకులను  జతచేసి మెత్తగా మిక్సీ చేసి, ఆ మిశ్రమాన్ని  కురులకు  పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.  ఇలా నెలకు రెండుసార్లు చేస్తే,  జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది.  అంతేకాదు మెదడును చల్లపరచి  జుట్టు రాలడాన్ని  తగ్గిస్తుంది. మెరిసే పట్టులాంటి కురులు మన సొంతం అవుతాయి. ఈ మిశ్రమాన్ని స్త్రీ, పురుషులిద్దరూ ఉపయోగించవచ్చు.