”శోధిని”

Saturday 30 June 2012

పండ్లు తింటే...




     ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పండ్లు రోగాలు తెచ్చిపెడుతున్నాయంటే నమ్మశఖ్యంగా ఉండదు.  ఇది పచ్చి నిజం. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లు నేడు మార్కెట్లో  కనబడడంలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.  పండ్లు త్వరగా మగ్గడానికి వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం అడ్డదారి తొక్కుతున్నారు.  పండ్లను మగ్గపెట్టడం కోసం ఇటీవల కాలంలో పలు ప్రాంతాలలో అనేక ఫ్రీజర్లు వెలసాయి.  అయితే వీటికి అనుమతులున్నాయా? అనుమతులు ఎవరు ఇచ్చారు? తెలియని పరిస్థితి.  పలు ప్రాంతాలలో కూడా ఇళ్ళలో కూడా ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.  పండ్లను మగ్గించడానికి రసాయనాలను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. ఇలా రసాయనాలతో  మగ్గించిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  డబ్బులను పెట్టి జబ్బులను కొంటున్నామని తెలుసుకోలేక పోతున్నారు.  ఇంత పబ్లిక్ గా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకొనేవారు  కరువయ్యారు.  ప్రభుత్వ అధికారులు మామూళ్ళ వేటలో ... పాలకులు అధికారాన్ని ఇలా నిలబెట్టుకోవాలని ఆలోచనలో మునిగి పోయారు.  అందుకే పండ్లను కొనేముందు  బాగా పరిశీలించి కొనండి. రసాయనాలతో మగ్గించిన పండ్లను  సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ పండ్లు గట్టిగా పసుపువర్ణంతో నిగనిగలాడుతూ ఉంటాయి. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లను, రసాయనాలతో మగ్గించిన పండ్ల మధ్య తేడా గుర్తిస్తే , ఆరోగ్యానిచ్చే పండ్లను తినవచ్చు.