”శోధిని”

Wednesday 25 February 2015

"ఆహా! ఏమి రుచి"


ఫిబ్రవరి 21, 22 తేదీలలో  విజయవాడలో జరిగిన 3వ  ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో  కమ్మటి తెలుగువారి విందు భోజనం రుచి చూపించారు.  అరటి ఆకులలో  చక్ర పొంగలి, పెరుగు వడలు, పులిహోర, ముద్ద పప్పు, గోంగూర పచ్చడి, గుమ్మడికాయ పులుసు, తోటకూర పప్పు, ఆవకాయ, అప్పడాలు, గుమ్మడి వడియాలు, పచ్చి పులుసు, ములక్కాయ సాంబారు, మసాల వంకాయ, కొబ్బరి పచ్చడి, చిక్కుడుకాయ వేపుడు, బెండకాయ వేపుడు, గడ్డ పెరుగు, నెయ్యి, దోసకాయ పచ్చడి వడ్డించారు. ఇంకా....ఇంకా కొన్ని గుర్తుకు  రావడం లేదు.  రుచి అమోఘం !