”శోధిని”

Saturday 31 October 2015

"జ్ఞానోదయం "


ఎన్నికల సందర్భంగా జరుగుతున్న  మీటింగ్ లో 
ఓ నాయకుడు మాట్లాడుతూ ...                                                                  "బిసీ, ఒసీల  పక్షపాతి మన మంత్రిగారు" అన్నాడు. 
మరో నాయకుడు మాట్లాడుతూ ...
"ఎస్సీ , ఎస్టీల   పక్షపాతి మన  నాయకుడు" అన్నాడు. 
ఎన్నికలు రానే వచ్చాయి
"మంత్రి గారు బిసీ, ఒసీల  పక్షపాతి కాబట్టి
మన కులాలవాళ్లు  అతనికి  ఓటు వేయవద్దు"
అని  ఎస్సీ , ఎస్టీల ఓటర్లు నిర్ణయించుకున్నారు. 
"మంత్రిగారు  ఎస్సీ , ఎస్టీల పక్షపాతి  కాబట్టి ... 
మనమంతా కలిసికట్టుగా అతన్ని  ఓడించాలి "
అని  బిసీ, ఒసీల ఓటర్లు నిర్ణయం తీసుకోవడంతో  
మంత్రిగారు  భారీ మెజారిటీతో ఓడిపోయారు.
అప్పటి నుంచి  కులాల పేరుతో 
ఓట్లు అడగకూడదని మంత్రిగారికి  జ్ఞానోదయం అయింది.