”శోధిని”

Thursday 18 October 2018

అపురూపం...అమ్మ దర్శనం


బ్రహ్మదేవుని వరం పొంది గర్వంతో ఋషులను, దేవతలను నానా బాధలు పెట్టిన మహిషాసురుడ్ని సంహరించిన అనంతరం తన ఉగ్రరూపాన్ని భరించగల యక్షున్ని   సింహాసనంగా చేసుకొని దుర్గాదేవిగా అవతరించిందిఅమ్మవారు.    అలా స్వయంభువుగా వెలసిన అమ్మవారు మహిషుడ్ని  తన 18 బాహువులతో అంతమొందించిన రోజు విజయదశమిగా జరుపుకుంటారు.   శ్రీరాముడు దశకంఠున్ని  సంహరించిన రోజు కూడా ఇదే కావడం వల్ల  ప్రజలు పండుగను జరుపుకుని ఆనందించింది కూడా ఇదే రోజు కావడం విశేషం.  అర్జునుడు ఈశ్వరుడిని తన తపస్సుతో మెప్పించి పాశుపతాస్త్రం పొంది విజయుడయినందున కూడా ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటారని మరోగాధ. ఏదిఏమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి. 

మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!