”శోధిని”

Wednesday 2 January 2019

అత్యంత పవిత్ర స్థలం రామేశ్వరం

రామనాథ స్వామి దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.  తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవక్షేత్రం.  ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది.   ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం"గా కొలువబడుతున్నాడు. ఈ దేవాలయ ప్రధాన దైవం "రామనాథస్వామి" (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారుచేసిన ఇసుక లింగంరెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం.