”శోధిని”

Sunday 27 November 2016

బాబోయ్... రెండువేలనోటు !



ఒక మంచి లక్ష్యంతో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం.  పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం.ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమే కానీ, అమలులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటు వల్ల పరిస్థితి మరింత చెయ్యిదాటి పోయింది. ఆనోటే సమాజంలో ప్రకంపనలు సృష్టించింది.   అన్ని రంగాలలో ఈ నోటు తీవ్ర ప్రభావితం చేసింది. సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రెండువేల నోటు స్థానంలో అయిదువందల నోటు ప్రవేశపెట్టి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదికాదు. ఇప్పుడు రెండువేల నోటు ప్రజలకు తలనొప్పిగా మారింది.  దాన్ని చూడగానే ప్రజలు భయపడుతున్నారు.  ఈ నోటే దేశంలో చిల్లర సమస్యను తెచ్చిపెట్టింది.  ఈ నోటువల్ల సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగాలేదని స్పష్టంగా  అర్థమవుతోంది.  చిన్న వ్యాపారాల మీద ఈ పెద్దనోటు ప్రభావం తీవ్రంగా ఉంది. తక్షణమే అయిదువందల నోట్లు దేశమంతా అమలులోకి వస్తే, నోట్ల సమస్య అతిత్వరగా సమసిపోతుంది. అన్ని బ్యాంకుల్లోనూ,  ఏటియంలలోనూ వంద, అయిదువందల నోట్లు విరివిగా పంపిస్తే, ప్రధాని ప్రయత్నం సఫలం అవుతుంది. 

"తెలుగు సినిమా"

పాత తెలుగు సినిమాలలో మంచి కథ, నీతి, మితిమీరని శృంగారం, వినసొంపయిన మధురమైన పాటలు, సున్నితమైన హాస్యం ఉండేవి. నాయికా నాయకులు నీతిని బోధించే పాత్రలు ధరించేవారు. అవినీతి, చెడుపై విజయంగా మంచి నీతిని ప్రబోధించేవారు. ఆ దిశగా రచయితలు కూడా రచనలు చేసేవారు. వాటి ప్రభావం సమాజంపై ఉండేది. మంచిని చూపించడంవల్ల ప్రజలకు సినిమాలపైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ, నేడు వస్తున్న సినిమాలలో అతి జుగుస్సాకరమైన మాటలు, వస్త్రధారణ, సన్నివేశాలు, పోరాటాలతో దేశంలోని చెడునంతా నింపేస్తున్నారు. కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారే తప్ప, అన్ని వర్గాల పేక్షకులను ఉపయోగపడే సినిమాలను నిర్మించడం లేదు. దాంతో కుటుంబసమేతంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోతోంది.

Thursday 24 November 2016

మందుబాబుల ఆగడాలు అరికట్టాలి.


తెలుగు రాష్ట్రాలలో మందు బాబుల ఆగడాలు రోజురోజుకి మితిమీరి పోతున్నాయి. పట్టపగలే తప్ప తాగి వాహనాలు నడుపుతూ రోడ్లమీద వెళ్ళే పాదచారులని, వాహనదారులని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారు. ఎన్నో రోడ్డ్ల ప్రమాదాలకు కారకులవుతున్నారు. రోడ్డు మీద వెళ్లేవారి పాలిట యమకింకరులుగా మారుతున్నారు. వీరి ఆగడాల వల్ల ఎన్నోకుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎంతో మంది అమాయకులు దుర్మరణం పాలవుతున్నా... మందుబాబులలో ఇసుమంతయినా కనికరం కూడా కలగడం లేదు. అంతేకాదు తాగినమైకంలోఅసభ్యపదజాలంతో ప్రజలమీడదికి కలియబడుతున్నారు. వీరి వల్ల మహిళలు, ప్రజలు తీవ్రమైన ఆవేదనను, మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. రానురాను వీరి ఆగడాలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. బైట ప్రజలే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది ప్రధాన సమస్యే! ప్రభుత్వాలు మద్యం ఆదాయం చూసుకుంటున్నాయి తప్ప, ప్రజల కష్టనష్టాలను గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని జరిమానాలు విధించినా మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు తాగి వస్తున్నా పట్టించుకునే నాధుడు లేడు. తాగి సేల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్టు ధరించకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల భాధలను అర్థం చేసుకొని మద్యం దుకాణాలను పగటి పూట మూయించి, రాత్రి ఏడు గంటల తర్వాత మాత్రమే తెరిచే విధంగా చర్యలు తీసుకుంటే మందుబాబుల ఆగడాలకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయవచ్చు.


Monday 21 November 2016

పవిత్రమైన కార్తిక మాసం



తెలుగు మాసాలలో కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం.  కార్తిక  మాసంలో శివుడికి అభిషేకములు, మారేడుదళాలు  సమర్పించినా  శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తిక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.



Sunday 13 November 2016

బాలల సంబురం !


నేటి బాలలు ...రేపటి మేధావులు !
వీరే మనదేశ భవిషత్తు ...మన దేశ సంపద!!
అందుకే బాల్యానికి భద్రత కల్పిద్దాం
పసిమొగ్గలను జాగ్రత్తగా కాపాడుకుందాం
బాలల దినోత్సవం  సందర్భంగా...
చిన్నారులందరికీ శుభాకాంక్షలు !




శివార్చన...!

 

తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది. కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని,  విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుందని,  రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

        ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ