”శోధిని”

Tuesday 7 June 2016

" మహనీయుడు "


బాటసార్లుకు చల్లదనం కోసం, స్వచ్చమైన గాలి కోసం   రోడ్లకు ఇరువైపుల అశోకుడు  చెట్లను నాటించాడు.  భూగర్భ జలాలను పెంచేందుకు,  పంటలు పండించేందుకు  ప్రతి గ్రామానికి చెరువులు,  మంచినీటి కోసం బావులు తవ్వించాడు.  ప్రకృతి రమణీయత,  పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేశాడు.  ఆయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లేవారని చరిత్ర చెబుతోంది.  ఆయన చేసిన సేవలు మరువలేనివి.  అందుకే ఆయన మహనీయుడు.  కేవలం ప్రచారం,  ప్రసంసల కోసం కాకుండా  అశోకుడిలా మన నాయకులు కూడా ప్రజల కోసం నిజమైన సేవ చేస్తే ఎంత బాగుండును.