”శోధిని”

Tuesday 14 February 2012

పేద రోగులను కాపాడండి!



జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి అత్యవసర సేవలను బహిష్కరించడంతో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సకాలంలో వైద్యం అందక రోగులు విలవిలలాడుతున్నారు.  ఇటు జూనియర్ డాక్టర్లు భీస్మించు కోవడం, అటు ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడంతో అనేకమంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. డబ్బున్నవాళ్ళు కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటుంటే, పేద రోగులు మాత్రం దిక్కు తోచక  ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు.  ఇంత జరుకుతున్నా జూనియర్ డాక్టర్స్ లోనూ,ప్రభుత్వంలోనూ చలనం లేకపోవడం బాధాకరం.  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులల్లో రోగుల అవస్థలు వర్ణణాతీతం.  ఇప్పటికైనా అమాయక పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, చర్చల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వంకూడా బెట్టుకుపోకుండా ఒక మెట్టు దిగి సమ్మెను విరమింపజేయాలి

పేద రోగులను కాపాడండి!

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి అత్యవసర 
వైద్య సేవలను బహిష్కరించడంతో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సకాలంలో వైద్యం 
అందక రోగులు విలవిలలాడుతున్నారు.  ఇటు జూనియర్ డాక్టర్లు భీస్మించు కోవడం, అటు ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడంతో అనేకమంది రోగుల 
ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.  డబ్బున్నవాళ్ళు కార్పోరేట్ ఆసుపత్రుల్లో 
వైద్యం చేయించుకుంటుంటే, పేద రోగులు మాత్రం దిక్కు తోచక  ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు.  ఇంత జరుకుతున్నా జూనియర్ డాక్టర్స్ లోనూ,
ప్రభుత్వంలోనూ చలనం లేకపోవడం బాధాకరం.  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులల్లో రోగుల అవస్థలు వర్ణణాతీతం.  ఇప్పటికైనా అమాయక పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, చర్చల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం కూడా
బెట్టుకు పోకుండా ఒక మెట్టు దిగి సమ్మెను విరమింప జేయాలి.