మహాదేవుని మహిమాన్విత రాత్రి, సకలలోకాలకు శుభరాత్రి... మహాశివరాత్రి. బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం పరిష్కరించడానికి జ్వలాస్తంభంలో తేజోలింగ రూపంలో ఆవిర్భవించాడు శివుడు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్థశిని భక్తులు భక్తిశ్రద్దలతో పగలంతా ఉపవాసం వుండి, రాత్రంతా ప్రార్థనలు, పూజలు, అభిషేకాలతో జాగారం చేస్తారు. లేతమారేడు దళాలను, ధూపదీపవైవేద్యాలు, తాంబూల ఫలాలను శివునికి సమర్పించుకుంటారు. ఇవన్నీ పరమేశ్వరుడుకి ఎంతో ప్రీతికరం. శివ స్తోత్రము తెలియనివారు భక్తిశ్రద్దలతో ‘ఓం నమశ్శివాయ’ అని స్మరిస్తూ, శివసాన్నిధ్యం పొందగలుగుతారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి, రెండుమారేడు దళాలు... దోసెడు నీళ్ళు శివలింగం పైన పోసి, కొంచెం భస్మం రాస్తే చాలు ఆయన పొంగిపోతాడు...కోరిన వరాలు ఇస్తాడు. శివరాత్రి నాడు శివారాధన మించిన పుణ్యం లేదంటారు.
మీకు, మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు !
మీకు, మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు !