”శోధిని”

Sunday 5 August 2018

నాలుగో జ్యోతిర్లింగం

ఓంకారేశ్వర  క్షేత్రం మధ్యప్రదేశ్ లో  ఉంది.   ఈ క్షేత్రం వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరి నదుల మధ్య ఉంది.  సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్ళినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడిందట.  ఆ శివలింగంలోంచి ఓంకారం వినబడుతుంది గ్రహించాడు.  ఆయన పెద్దలను తీసుకొచ్చి  చూపించాడట.  పెద్దలు చూసి 'ఓంకారేశ్వరుడని' పేరు పెట్టారని చెబుతారు.   అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం.  అది నిత్యనూతనం.  ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల  ప్రణవనాద అనుసంధానంతో ఏకాగ్రత లభిస్తుందంటారు.