”శోధిని”

Monday 14 September 2015

చిన్న విగ్రహాలను ప్రతిష్టించు ...పర్యావరణాన్ని కాపాడు !


వినాయకుడిని పూజించడానికి పెద్ద  విగ్రహాలు  ప్రతిష్టించాల్సిన  అవసరం లేదు.  విగ్రహం ముప్పయ్ అంగుళాలు ఉంటే చాలు.  పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది.  గణేష్ విగ్రహాలు పోటిపడి భారీ స్థాయిలో ప్రతిష్టించి, మైకులు, డి.టి.ఎస్  సౌండ్లతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించగుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. మండపాన్ని అలంకరించే సీరియో బల్బులు, ఫ్లడ్ లైట్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. కాని, వాటికి ఉపయోగించే కరెంటు మాత్రం పబ్లిక్ గా విద్యుత్ చౌర్యం చేయకుండా  విద్యుత్ అధికారులను సంప్రదించి,  తగిన పైకం చెల్లించి విద్యుత్ ను వాడుకుంటే బాగుంటుంది.  విద్యుత్ అధికారులు  సూచించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఇంట్లో  ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాధ్యమైనంతవరకు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి.  మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే చూడముచ్చటగా ఉంటాయి.  పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించి  జలాశయాలను  కలుషితం కాకుండా, అందులోని జల పుష్పాలకు హాని కలుగకుండా  చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.