”శోధిని”

Wednesday 24 September 2014

హైదరాబాద్ ను కాటేస్తున్న కాలుష్యం !


గ్రేటర్ హైదరాబాద్ లో నానాటికి పెరుగుతున్న కాలుష్యం,   నగరవాసులకు ప్రాణసంకటంగా మారుతోంది.  లక్షల్లో పెరిగిన వాహనాల నుంచి నిత్యం వెలువడుతున్న దుమ్ము, ధూళి నగరప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  వాతావరణంలో ధూళి రేణువులు అధికం కావడం వల్ల రోజూ బయట సంచరించే వారు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. దీనికి తోడు విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ జరగడం, పరిశ్రమల నుండి హానికరమైన వాయువులు వాతావరణంలోకి వదలడం వలన భూతాపం పెరిగిపోతోంది.  కాలుష్యం వల్ల హానికర వ్యర్థాలు చెరువుల్లో కలుపుతున్నారు.  అవి నీటి వనరులను కలుషితం చేసి నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి.  వాహన కాలుష్యం, జలకాలుష్యం పెరగడం కారణంగా భూమి రోజురోజుకు వేడెక్కి, మొత్తం జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా  మారుతోంది.  పరిస్థితి మరింత విషమించక  ముందే అధికారులు మేల్కొని,  వాయు, జల కాలుష్యం నుండి హైదరాబాద్ ను కాపాడాలి.