మాఘమాసం బహుళ చతుర్దశినాడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది కాబట్టి ఈ రోజున పరమ పవిత్రమైన మహాశివరాత్రి అయింది. లింగోద్భవం సమయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరిగింది. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి. ఈ శుభకరమైన శివరాత్రి రోజున పవిత్ర స్నానాలు, అభిషేకాలు, ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. కేవలం ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే సరిపొదు. అనుక్షణం 'ఓం నమశ్శివాయ' అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ... మనసును పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. పార్వతీదేవి స్వేదం నుండి వుద్బవించిన బిల్వ వృక్షాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి. శివునికి ఇష్టమైన బిల్వపత్రం పట్టుకున్నా శివలింగాన్ని దర్శించుకునంత ఫలితం దక్కుతుంది... ఆరోగ్యం, ఐశ్వర్యం అభిస్తాయి. ప్రపంచంలోవున్న సర్వ తీర్థాలు బిల్వపత్రంలో ఉన్నాయి కాబట్టి బిల్వపత్రంతో శివలింగాన్ని పూజిస్తే ... శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రజలందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.
Tuesday 17 February 2015
సర్వం శివమయం !
మాఘమాసం బహుళ చతుర్దశినాడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది కాబట్టి ఈ రోజున పరమ పవిత్రమైన మహాశివరాత్రి అయింది. లింగోద్భవం సమయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరిగింది. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి. ఈ శుభకరమైన శివరాత్రి రోజున పవిత్ర స్నానాలు, అభిషేకాలు, ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. కేవలం ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే సరిపొదు. అనుక్షణం 'ఓం నమశ్శివాయ' అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ... మనసును పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. పార్వతీదేవి స్వేదం నుండి వుద్బవించిన బిల్వ వృక్షాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి. శివునికి ఇష్టమైన బిల్వపత్రం పట్టుకున్నా శివలింగాన్ని దర్శించుకునంత ఫలితం దక్కుతుంది... ఆరోగ్యం, ఐశ్వర్యం అభిస్తాయి. ప్రపంచంలోవున్న సర్వ తీర్థాలు బిల్వపత్రంలో ఉన్నాయి కాబట్టి బిల్వపత్రంతో శివలింగాన్ని పూజిస్తే ... శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రజలందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment