”శోధిని”

Saturday 30 May 2015

మానవసేవే మాధవసేవ !


శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన గొప్ప సేవ అన్నదానం కార్యక్రమం.  నిత్యం ముప్పయివేల మందికి పైగా భక్తులు అన్నదానం కాంప్లెక్స్ లో భోజనం చేసి స్వామివారి మహాప్రసాదం తిన్నంత ఆనందపడిపోతారు. పేద భక్తులకు ఈ సదుపాయం నిజంగా ఒక వరమే !  రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉచిత భోజనాలు పెడుతూనే ఉంటారు.  ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయన చేతుల మీదుగా ప్రారంభమైన గొప్ప పుణ్య సేవా కార్యక్రమం అన్నదానం.

No comments: