”శోధిని”

Friday 27 March 2015

రమణీయం ...శ్రీరామనామం !



       తండ్రి మాటను నిలబెట్టడానికి తన జీవితాన్ని, యౌవనాన్ని అడవిపాలు
చేసుకున్న శ్రీరామచంద్రుడు  ఎంతో మహాన్నతుడు.  తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ధర్మ ప్రభువుగా జీవించి, అందరి మన్నలను పొందాడు.  తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలు, భర్యాభార్తల మధ్య ఉండవలసిన అనురాగం, అవగాహన, పిల్లల పట్ల తండ్రి బాధ్యత మొదలైనవన్నీ తాను ఆచరించి లోకానికి తెలియజెప్పిన ఆదర్శముర్తి శ్రీరాముడు.  రమణీయమైన రామకథను ఎందరెందరో కవులు ఎన్నెన్నో భాషల్లో వ్రాసి చరితార్థులయ్యారు.  కోదండరాముని కథని ఎన్నిమార్లు విన్నా, కన్నా, చదివినా తనివి తీరదు. రామబాణం రక్షిస్తుంది... రామహస్తం దీవిస్తుంది... రామ పాదం నడిపిస్తుంది...రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది.
   " శ్రీరామ రామ రామేతి - రమే రామే మనోరమే !
      సహస్ర నామ తత్తుల్యం - రామ నామ వరాననే !! "

No comments: