”శోధిని”

Saturday 27 April 2019

ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి.

సరైన  పర్యవేక్షణ లేకపోవడంతో ఇంటర్మీడియట్ బోర్డులోని ప్రతి వ్యవస్థ లోపభూయిష్టంగా  మారింది.  అసలు బోర్డులో ఏమి జరుగుతోంది? అక్కడ సిబ్బంది పనితీరు ఎలా ఉంది ? అని తెలుసుకునే నాధుడే లేకపోవడంతో  సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది.   వారి నిర్లక్షానికి ఏంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు  బలికావడం ఏమిటి?   అధికారుల తప్పిదాలవల్ల పొరపాట్లు జరిగాయని చెప్పడం సహించరాని నేరం.   మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని,  విద్యార్థుల కన్నీటికి కారకులయిన అధికారులను కఠినంగా శిక్షించాలి.  సప్లిమెంటరీ పరీక్షలను కొద్దిరోజులు వాయిదా వేసి, రీకౌంటింగ్, వెరిఫికేషన్ కోసం విద్యార్థులు నుండి ఎలాంటి రుసుము తీసుకోకుండా తగు చర్యలు చేపట్టాలి.  ఇప్పటికయినా  ప్రభుత్వం స్పందించి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న ఇంటర్ బోర్డును  పూర్తిగా ప్రక్షాళన చేయాలి.



                                                                                            -

No comments: