”శోధిని”

Sunday 3 March 2019

పరమ పవిత్రమైన రోజు ...మహాశివరాత్రి.

అఖిల భక్తకోటికి పరమ పవిత్రమైన రోజు ...మహాశివరాత్రి.  పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, రోజంతా శివనామస్మరణం.     శివుడిని ప్రసన్నం చూసుకోవడానికి మంత్రాలు, స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు.  'ఓం నమశ్శివాయ' అంటూ కాసిన్ని శుద్ధజాలాలు శివలింగానికి సమర్పించినా,  శివుడు మురిసిపోయి ముక్తిని ప్రసాదిస్తాడు.  పూజాసమయంలో తెలిసీతెలియక చేసిన అపరాధాలను మన్నించమని వేడుకుంటే చాలు ఆయన పెద్ద మనసుతో  మన్నిస్తాడు.  నిర్మలమైన హృదయంతో మారేడుదళాలను, ధూపదీప నైవేద్యాలను, తాంబూల దక్షిణలను, ఫలాలను పూజ సందర్భంగా సమర్పిస్తే చాలు ఆయన  కరుణ లభిస్తుంది.  


No comments: