”శోధిని”

Friday 25 January 2019

70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !














కుల-మత, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం.   మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు.   మన రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత  డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా గణతంత్ర  దినోత్సవం జరుపుకోవడం జరిగింది.   ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.  గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.  కానీ, ఆ అర్థం కాస్త నేడు  రాజకీయనాయకులే ప్రభుత్వం,  ప్రభుత్వమే రాజకీయనాయకులుగా మారిపోయింది.  70 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని స్మరించుకుందాం.


No comments: