”శోధిని”

Sunday 30 September 2018

పన్నెండో జ్యోతిర్లింగం


పన్నెండో జ్యోతిర్లింగం  ఘృష్టేశ్వరం.  ఇది మహారాష్ట్రలో ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఎల్లోరా  పురాణనామం ఇలాపురం.  ఇలాపురం  భూమిపై చాలా అందమైన ప్రదేశం కావడం వల్ల పార్వతీ పరమేశ్వరులు కొంతకాలం ఇక్కడ నివసించారట.  పార్వతీదేవి   ఒకనాడు తన ఎడమ చేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వేలితో చాదుతుండగా ఆ ఘర్షణతో ఒక జ్యోతి ఉద్భవించిందట.  మిగిలిన జ్యోతిర్లింగాలలో పరమేశ్వరుని ఆవిర్భావానికి వేరే కథలున్నాయి.  ఇక్కడ మాత్రం అమ్మవారి చేతి రాపిడితో జ్యోతిర్లింగ  రూపాన్ని ధరించింది.  ఇది పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను, దంపతుల మధ్య ఉండవలసిన అవగాహనను, ఆప్యాయతను తెలుపుతుంది.  ఎదురుగా ఉన్న వేడిమినైనా, విషాన్ని  అయినా తనలోకి తీసుకుని ఎదుటివారికి, తనను నమ్మినవారికి కష్టాలను, దుఃఖాలను తొలగించడమే పరమేశ్వరతత్వం అనే రహస్యం  ఘృష్టేశ్వర దర్శనంతో అవగతమౌతుంది.  ఘర్షణలో ఆవిర్భవించడం చేత ఈ జ్యోతిర్లింగానికి  ఘృష్టేశ్వరనామం ఏర్పడింది. 

చివరిగా  భారతదేశం నలుగు దిక్కులా  జ్యోతిర్లింగ రూపుడై సమస్త ప్రాణులను కాపాడుతున్న పరమేశ్వరుని కరుణాకటాక్షం అందరికీ  కలగాలని కోరుకుందాం.



No comments: